Saturday, March 10, 2018

నీలకంఠ వైభవం - 24

8-245-క.
ఉదరము లోకంబులకును
సదనం బగు టెఱిఁగి శివుఁడు చటుల విషాగ్నిం
గుదురుకొనఁ గంఠబిలమున
బదిలంబుగ నిలిపె సూక్ష్మఫలరసము క్రియన్.

భావము:
పరమేశ్వరుడి ఉదరం సమస్త లోకాలకూ నివాసం కనుక. ఆయన ఆ భీకరమైన విషాగ్నిని ఉందరంలోనికి పోనివ్వకుండా, ఏదో చిన్న పండ్ల రసాన్ని ఉంచుకున్నట్లుగా, తన కంఠ బిలంలో కుదురుగా ఉండేలా జాగ్రత్తగా నిలుపుకున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=245

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: