Friday, February 16, 2018

నీలకంఠ వైభవం - 9

8-225-క.
కొందఱు గలఁ డందురు నినుఁ; 
గొందఱు లేఁ డందు; రతఁడు గుణి గాఁ డనుచుం
గొందఱు; గలఁ డని లేఁ డని
కొందల మందుదురు నిన్నుఁ గూర్చి మహేశా!

భావము:
ఓ పరమేశ్వరా! మహాప్రభూ! కొందరు నీవు ఉన్నావు అంటారు. కొందరు నీవు లేవు అంటారు. ఇంకా కొందరు నీవు సగుణరూపుడవు అంటారు. మరికొందరు నీవు ఉన్నావో లేవో అనే సందేహాలతో కొట్టుమిట్టాడుతుంటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=225

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: