Tuesday, February 6, 2018

నీలకంఠ వైభవం - 4

8-219-మ.
చని కైలాసముఁ జొచ్చి శంకరుని వాసద్వారముం జేరి యీ
శుని దౌవారికు లడ్డపడ్డఁ దల మంచుం జొచ్చి కుయ్యో మొఱో
విను; మాలింపుము; చిత్తగింపుము; దయన్ వీక్షింపు మం చంబుజా
సనముఖ్యుల్ గని రార్తరక్షణ కళాసంరంభునిన్ శంభునిన్.


భావము:
ఆ సమయంలో బ్రహ్మాది దేవతా ప్రముఖులు అందరూ ఆర్తితో ఆశ్రయించిన వారిని కాపాడే వాడూ, సుఖప్రదాతా అయిన శంకరుని వేడుటకు కైలాసానికి వెళ్ళారు. పరమశివుని మందిరం ద్వారపాలకులు అడ్డుకున్నారు. కానీ వారిని తప్పుకోమని లోనికి ప్రవేశించి ఈశ్వరుని దర్శనం చేసుకుని “శరణు, శరణు చిత్తగించు దయతో చూడు, కాపాడు” అంటూ మొరపెట్టుకున్నారు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments: