Tuesday, February 6, 2018

నీలకంఠ వైభవం - 3

8-217-క.
ఒడ్డారించి విషంబున
కడ్డము చనుదెంచి కావ నధికులు లేమిన్
గొడ్డేఱి మ్రంది రా లన
బిడ్డన నెడలేక జనులు పృథ్వీనాథా!
8-218-వ.
అప్పుడు


భావము:
ఓ రాజా! అప్పుడు ఆ విషాగ్నిని అడ్డగించే సాహసం చేసి కాపాడే మహనీయులు లేకపోయారు. పెళ్ళం పిల్లలు అనే మమకారం లేకుండా పారిపోయికూడా జనులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలా హాలహలం వ్యాపిస్తున్న సమయంలో. . . .



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments: