Sunday, February 25, 2018

నీలకంఠ వైభవం - 17

8-234-క.
ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన 
ప్రాణుల రక్షింపవలయుఁ బ్రభువుల కెల్లం
బ్రాణుల కిత్తురు సాధులు 
బ్రాణంబులు నిమిష భంగురము లని మగువా!
8-235-క.
పరహితము జేయు నెవ్వఁడు
పరమ హితుం డగును భూత పంచకమునకుం
బరహితమె పరమ ధర్మము
పరహితునకు నెదురులేదు పర్వేందుముఖీ!


భావము:
ఓ మగువా! పార్వతీ దేవి! ప్రాణభయంతో ఆశ్రయించిన జీవులను కాపాడటం ప్రభువుల కర్తవ్యం. ప్రాణాలు నిమిషంలో నశించి పోయేవి. అందువలననే ఉత్తములు ప్రాణులకు తమ ప్రాణాలను అర్పించుటకు సైతం వెనుకాడరు. ఓ సౌందర్యరాశీ! పార్వతీదేవీ! ఇతరులకు సాయం చేసేవాడు, పంచభూతాలకూ పరమాప్తుడు అయి ఉంటాడు. పరోపకారమే పరమోత్తమ ధర్మం. పరోకారికి ఎక్కడా తిరుగు లేదు.


http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=234


:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments: