Friday, December 22, 2017

ద్వారక అస్తమయం - 5

11-9-క.
"హరిపాదకమల సేవా
పరులగు యాదవుల కెట్లు బ్రాహ్మణశాప
స్ఫురణంబు సంభవించెనొ
యరయఁగ సంయమివరేణ్య! యానతి యీవే! "
11-10-క.
అనిన జనపాలునకు ని
ట్లని సంయమికులవరేణ్యుఁ డతి మోదముతో
విను మని చెప్పఁగఁ దొడఁగెను
ఘనతర గంభీర వాక్ప్రకాశస్ఫురణన్‌.

భావము:
“మహానుభావ! మహాయోగీశ్వర! శ్రీకృష్ణుడి పాదపద్మాలను ఎప్పుడూ సేవిస్తూ ఉండే యాదవులకు బ్రాహ్మణశాపం ఎలా కలిగిందో తెలపండి.” ఇలా అడిగిన మహారాజుకు సంయమి శ్రేష్ఠుడైన శుకమహర్షి ఘనతరములు గంభీరములు అయిన వాక్కులతో ఈ విధంగా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=3&padyam=9

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: