Sunday, December 17, 2017

ద్వారక అస్తమయం - 4

11-8-వ.
అని వితర్కించి జగదీశ్వరుం “డత్యున్నత వేణుకాననంబు వాయువశంబున నొరసికొన ననలం బుద్భవంబయి దహించు చందంబున యదుబలంబుల కన్యోన్య వైరానుబంధంబులు గల్పించి హతం బొనర్చెద” నని విప్రశాపంబు మూలకారణంబుగాఁ దలంచి యదుబలంబుల నడంచె నని పలికిన మునివరునకు రాజేంద్రుం డిట్లనియె.

భావము:
ఇలా తర్కించుకొని లోకనాయకుడైన వాసుదేవుడు చాలా ఎత్తైన వెదురు పొదల అడవిలో పుట్టిన గాలికి వెదురులు ఒరుసుకుని నిప్పు పుడుతుంది. ఆ అగ్నిలో తనకు తానే కాలిపోతుంది. అదే విధంగా యదుబలాలకు పరస్పర విరోధాలు కల్పించి నాశనం చేయాలని నిశ్చయించాడు. దానికి మూలకారణం బ్రాహ్మణశాపం కావాలని తలచాడు. ఆ ప్రకారమే యాదవనాశనం కలిగించాడు.” అని పలికిన శుకమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=3&padyam=8

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: