Saturday, November 25, 2017

పోతన రామాయణం - 45

9-343-వ.
అంత నా రామచంద్రుని దానశీలత్వంబునకు మెచ్చి విప్రవరులు దమతమ భూములు మరల నిచ్చి యిట్లనిరి.
9-344-ఆ.
"ధరణి వలదు మాకుఁ దపసుల కేల? నీ
వఖిలలోక గురుఁడవైన హరివి; 
మా మనంబు లందు మలయు చీఁకటిఁ బాపు
భవ దుదారరుచులఁ బార్థివేంద్ర!"
9-345-వ.
అని పలికి బ్రహ్మణ్యదేవుండైన రామచంద్రుని వినయోక్తులం బూజించి మునులు చని; రిట్లు పెద్దకాలంబు రాజ్యంబుచేసి, రాఘవేంద్రుం డొక్కదినంబున.


భావము:


అంతట, శ్రీరాముడి వితరణబుద్ధికి మెచ్చుకొని బ్రాహ్మణులు వారందరు ఆయా భూములు వెనుకకు ఇచ్చివేసి ఇలా అన్నారు. “రాజా! మునులం అయిన మాకు రాజ్యం ఎందుకు, వద్దు, నీవు సకల లోకాలకు పూజినీయుడవు. విష్ణుమూర్తివి.. నీ దయా కిరణాలు ప్రసరించి, మా మనసులలో కమ్ముకొన్న అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టుము.”అని చెప్పి ఆ మునులు దేవోత్తముడైన శ్రీరాముని వినయ వినమ్రులై పూజించి వెళ్ళిపోయారు. ఇలా చాలా కాలం రాజ్యపాలనం చేసి శ్రీరాముడు ఒక రోజు...



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments: