Wednesday, November 22, 2017

పోతన రామాయణం - 43

9-340-ఆ.
"భ్రాతృజనుల యందు బంధువులందును
ప్రజల యందు రాజభావ మొంది
యెట్లు మెలఁగె? రాఘవేశ్వరుం డెవ్వనిఁ
గూర్చి క్రతువు లెట్లు గోరి చేసె?"
9-341-వ.
అనిన శుకుం డిట్లనియె.

భావము:
“శ్రీరాముడు సోదరులు, బంధువులు, లోకులు ఎడ మహారాజుగా ఎలా మసిలాడు. ఎవరిని ఉద్దేశించి యాగాలు ఏ విధంగా ఆచరించాడు.” అని చెప్పి శుకుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=340

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: