Thursday, November 16, 2017

పోతన రామాయణం - 37

9-328-వ.
ఇట్లు వచ్చి.
9-329-ఉ.
తల్లులకెల్ల మ్రొక్కి తమ తల్లికి వందన మాచరించి య
ల్లల్ల బుధాళికిన్ వినతుఁడై చెలికాండ్రను దమ్ములం బ్రసం
పుల్లతఁ గౌగలించుకొని భూవరుఁ డోలిఁ గృపారసంబు రం
జిల్లఁగఁ జాల మన్ననలు చేసె నమాత్యులఁ బూర్వభృత్యులన్.
9-330-వ.
తత్సమయంబునఁ దల్లులు

భావము:
ఇలా అంతపురం చేరి శ్రీరాముడు తల్లులు అందరికి నమస్కరించి తమ కన్నతల్లికి నమస్కారం చేసాడు. పండితుల ఎడ వినయం చూపించాడు. స్నేహితులకు తమ్ముళ్ళకు ఆలింగనాలు చేసాడు. మంత్రులను, సేవకులకు మిక్కిల ఆదరం చూపించాడు. ఆ సమయంలో తల్లులు....

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=329

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: