Friday, October 27, 2017

పోతన రామాయణం - 21

9-297-వ.
అయ్యవసరంబున.
9-298-క.
సురపతిపంపున మాతలి
గురుతరమగు దివ్యరథముఁ గొనివచ్చిన, నా
ధరణీవల్లభుఁ డెక్కెను
ఖరకరుఁ డుదయాద్రి నెక్కు కైవడి దోఁపన్.

భావము:
ఆ సమయంలో.... ఇంద్రుడు పంపగా ఇంద్రసారథి మాతలి బహు భవ్యమైన రథాన్ని తీసుకు వచ్చాడు. శ్రీరాముడు ఆ రథం ఎక్కాడు. అలా రాముడు ఎక్కుతుంటే, సూర్యుడు తూర్పుకొండ ఎక్కుతున్నట్లు అనిపించింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=298

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: