Sunday, October 15, 2017

పోతన రామాయణం - 16

9-287-వ.
అని విన్నవించిన రామచంద్రుండు సముద్రునిం బూర్వప్రకారంబున నుండు పొమ్మని వీడుకొల్పెను; అంత.
9-288-క.
ఘన శైలంబులుఁ దరువులు
ఘనజవమునఁ బెఱికి తెచ్చి కపికులనాథుల్
ఘనజలరాశిం గట్టిరి
ఘనవాహప్రముఖదివిజగణము నుతింపన్.
9-289-వ.
ఇట్లు సముద్రంబు దాఁటి రామచంద్రుండు రావణు తమ్ముం డైన విభీషణుండు శరణంబు వేఁడిన నభయం బిచ్చి; కూడుకొని లంకకుఁ జని విడిసి వేడెపెట్టించి లగ్గలుపట్టించిన.

భావము:
అని సముద్రుడు మనవి చేసుకొనగా శ్రీరాముడు “ఇక వెళ్ళు ఇదివరకు లాగే ఉండు” అని పంపివేసాడు. అప్పుడు. శీఘ్రమే పెద్ద కొండరాళ్ళు, వృక్షాలు పెకిలించి తీసుకొచ్చి వానర జాతి నాయకులు సముద్రము మీద నిర్మించారు. ఇంద్రాది దేవతలు అందరూ స్తుతించారు. ఈ విధంగ సముద్రం దాటి శ్రీరాముడు తన అండ కోరిన శత్రువు రావణుని తమ్ముడు విభీషణుడికి అభయం ఇచ్చాడు. తన పరివారంలో కలుపుకున్నాడు. లంకానగరం వెళ్ళి విడిసి, చుట్టుముట్టి, ముట్టడించాడు. కోటలెక్కించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=288

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: