Thursday, September 14, 2017

పోతన రామాయణం - 4

9-264-క.
రాముఁడు నిజబాహుబల
స్థేమంబున భంగపఱిచె దీర్ఘకుఠారో
ద్దామున్ విదళీకృతనృప
భామున్ రణరంగభీము భార్గవరామున్.
9-265-క.
దశరథుఁడు మున్ను గైకకు
వశుఁడై తానిచ్చి నట్టి వరము కతన వా
గ్దశ చెడక యడివి కనిచెను
దశముఖముఖకమలతుహినధామున్ రామున్.

భావము:
శ్రీరాముడు తన భుజబలాతిశయంతో; గొడ్డలి ఆయుధం పట్టే గండరగండడిని, రాజలోకం అందరి రోషం పటాపంచలు చేసిన వాడిని, భీకరమైన యుద్ధం చేసేవాడిని, పరశురాముడిని భంగపరచాడు. దశరథుడు ఇంతకు ముందు తాను కైకకు ఇచ్చిన వరాలకు కట్టుబడి రావణుని ముఖ కమలాలకు చంద్రునివంటి వాడైన శ్రీరాముడిని అడవికి పంపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=264

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: