Thursday, April 20, 2017

దక్షయాగము - 8:

4-44-వ.
ఇతనికి నస్మత్తనూజను విధిప్రేరితుండనై యిచ్చితి.”
4-45-క.
అని యిట్టులు ప్రతికూల వ
చనములు దక్షుండు పలికి శపియింతును శ
ర్వుని నని జలములు గొని కర
మున నిలిపి యిటులనె రోషమున ననఘాత్మా!
4-46-క.
"ఇతఁ డింద్రోపేంద్ర పరీ
వృతుఁడై మఖసమయమున హవిర్భాగము దే
వతలం గూడఁగ మహిత ని
యతిఁ బొందక యుండుఁగాక యని శపియించెన్."


భావము:
ఇతనికి బ్రహ్మ మాట విని నా పుత్రికను ఇచ్చాను.” అని ఈ విధంగా దక్షుడు నిందించి “శంకరుని శపిస్తాను” అంటూ శాపజలాలను చేతిలో తీసికొని రోషంతో ఇలా అన్నాడు. “ఈ శివుడు ఇంద్రుడు, విష్ణువు మొదలైన దేవతలతోపాటు యజ్ఞంలో హవిర్భాగం పొందకుండు గాక!” అని శపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&Padyam=46

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: