Tuesday, April 4, 2017

మత్స్యావతార కథ - 22:


8-730-ఆ.
నీరరాశిలోన నిజకర్మ బద్దమై
యుచితనిద్రఁ బొంది యున్న లోక
మే మహాత్ముచేత నెప్పటి మేల్కాంచు
నట్టి నీవు గురుఁడ వగుట మాకు.
8-731-క.
ఆలింపుము విన్నప మిదె
వేలుపు గమిఱేని నిన్ను వేఁడికొనియెదన్
నాలోని చిక్కు మానిచి
నీలోనికిఁ గొంచుఁ బొమ్ము నిఖిలాధీశా!

భావము:
కర్మఫలానికి లోబడి సముద్రంలో మునిగి కూరుకుపోయిన లోకాన్ని మేలుకొలిపే మహాత్ముడవు నీవు. నీవు దేవతలకు ప్రభువవు. అటువంటి నీవు మాకు గురువవు అయ్యావు. ఓ సర్వేశ్వరా! దేవధిదేవా! మా విన్నపాలు మన్నించమంటూ ప్రార్దిస్తున్నాను. నాలోని సంకటాన్ని తొలగించి నన్ను నీ లోకానికి చేర్చుకోమని వేడుకుంటున్నాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=90&padyam=731

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: