Sunday, April 23, 2017

దక్షయాగము - 11:

4-50-తే.
"వసుధ నెవ్వారు ధూర్జటివ్రతులు వారు
వారి కనుకూలు రగుదు రెవ్వారు వారు
నట్టి సచ్ఛాస్త్ర పరిపంథు లైన వారు
నవనిఁ బాషండు లయ్యెద" రని శపించె.

భావము:
ఈ లోకంలో ఎవరు శివదీక్షాపరాయణులో, ఎవరు వారిని అనుసరిస్తారో వారంతా శాస్త్రాలకు విరోధులై పాషండులు అగుదురు గాక!

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&Padyam=50



: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: