Monday, September 5, 2016

క్షీరసాగరమథనం – ధన్యులు వైరోచని

8-329-క.
న్యులు వైరోచని శత
న్యుప్రముఖులు మదాభిమానులు దమలో
న్యోన్యరణము బాహా
సిన్యాసంబులను బేర్చి చేసిరి కడిమిన్.
టీకా:
          ధన్యులు = పుణ్యులు; వైరోచని = బలిచక్రవర్తి; శతమన్యు = ఇంద్రుడు; ప్రముఖులు = మొదలగువారు; మద = మదము; అభిమానులు = గర్వములుగలవారు; తమ = వారి; లోన్ = లోపల; అన్యోన్య = ఒకరితోఒకరుచేయు; రణము = యుద్ధము; బాహ = చేతి; అసి = కత్తి; న్యాసంబులన్ = విన్యాసములతో; పేర్చి = అతిశయించి; చేసిరి = చేసితిరి; కడిమిన్ = పరాక్రమముతో.
భావము:
          విరోచనుని (ప్రహ్లాదుని కొడుకు) కొడుకు అయిన బలిచక్రవర్తి, నూరు యజ్ఞములు చేసి పదవి పొందిన ఇంద్రుడు మొదలైన బలవంతులు ఖడ్గాలు చేబూని మదించిన స్వాభిమానాలు కలవారై, చెలరేగి బాహాబాహి పోరాటాలు సాగించారు.
          న్యూనఫలదాయక పోరాటాలు కనుక కఠినతరమైన న్య కార ప్రాస.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: