Monday, January 11, 2016

ప్రహ్లాదుని జన్మంబు -

7-225-మత్త.
ప్రల్లదంబున వేల్పు లుద్ధతిఁ బాఱి రాజనివాసముం
గొల్ల బెట్టి సమస్త విత్తముఁ గ్రూరతం గొని పోవఁగా
నిల్లు చొచ్చి విశంకుఁడై యమరేశ్వరుం డదలించి మా
ల్లిఁ దాఁ జెఱఁబట్టె సిగ్గునఁ ప్తయై విలపింపఁగాన్.
టీకా:
          ప్రల్లదంబునన్ = పౌరుషముతో; వేల్పులు = దేవతలు; ఉద్ధతిన్ = అతిశయించి; పాఱి = పరుగెట్టుకెళ్ళి; రాజనివాసమున్ = రాచనగరిని; కొల్లబెట్టి = కొల్లగొట్టి; సమస్త = అఖిలమైన; విత్తమున్ = ధనమును; క్రూరతన్ = క్రూరముగా; కొనిపోవగాన్ = తీసుకొనిపోవుచుండగా; ఇల్లున్ = ఇంటియందు; చొచ్చి = దూరి; విశంకుడు = జంకులేనివాడు; ఐ = అయ్యి; అమరేశ్వరుండు = ఇంద్రుడు; అదలించి = భయపెట్టి; మా = మా యొక్క; తల్లిన్ = తల్లిని; తాన్ = తను; చెఱబట్టె = బంధించెను; సిగ్గున = సిగ్గుతో; తప్త = కాగిపోయినది; ఐ = అయ్యి; విలపింపగాన్ = ఏడుస్తుండగా.
భావము:
          దండెత్తి వచ్చిన దేవతలు దౌర్జన్యంతో రాక్షసరాజు నివాస మందిరాన్ని వెంటనే ఆక్రమించారు. సర్వ సంపదలూ, ధనాగారం సమస్తం దోచేశారు. దేవేంద్రుడు సంకోచం లేకుండా అంతఃపురంలోకి చొరబడ్డాడు. మా తల్లిని చెరబట్టాడు. ఆమె సిగ్గుతో విలవిలలాడింది. దేవేంద్రుడు ఆమె ఎంత ఏడ్చినా వినిపించుకోలేదు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: