Wednesday, June 11, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 314

ఓయమ్మ నీకుమారుడు


10.1-329-క.
మ్మ! నీ కుమారుఁడు
మా యిండ్లను బాలు పెరుగు ననీ డమ్మా!
పోయెద మెక్కడి కైనను
మా న్నల సురభులాన మంజులవాణీ!
          ఓ యశోదమ్మ తల్లీ! నీ సుపుత్రుడు మా ఇళ్ళల్లో బాలుపెరుగు బతకనీయ డమ్మా. మెత్తని మాటల మామంచి దానివే కాని. సర్దిపుచ్చాలని చూడకు. మేం వినం. మా అన్న నందుల వారి గోవుల మీద ఒట్టు. ఈ వాడలో మేం ఉండలేం. ఊరు విడిచి పోతాం. మాకు మరో గతి లేదు.
ఆ కపట శైశవమూర్తి కృష్ణమూర్తి దొంగజాడల జేయు బాల్యచేష్టలను గోపికలు ఓపికలు లేక యశోదాదేవికి చెప్పుకుంటున్నారు.
10.1-329-ka.
O yamma! nee kumaaru@MDu
maa yiMDlanu baalu perugu mananee Dammaa!
pOyeda mekkaDi kainanu
maa yannala surabhulaana maMjulavaaNee!
          = ఓహో; అమ్మ = తల్లి; నీ = నీ యొక్క; కుమారుడు = పుత్రుడు; మా = మా యొక్క; ఇండ్లను = నివాసములలో; పాలున్ = పాలు; పెరుగున్ = పెరుగు; మననీడు = బతకనీయడు; అమ్మా = తల్లీ; పోయెదము = పోతాము; ఎక్కడి కైనను = మంరికొక చోటునకు; మా = మా యొక్క; అన్నల = తండ్రుల యొక్క; సురభులు = గోవులమీద; ఆన = ఒట్టు; మంజులవాణీ = సుందరీ {మంజులవాణి - మృదువుగా మాటలాడెడి యామె, స్త్రీ}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: