Monday, March 13, 2017

మత్స్యావతార కథ - 4:



8-697-ఆ.
వలలు దారు నింక వచ్చి జాలరి వేఁట
కాఱు నేఱు గలఁచి కారపెట్టి
మిడిసి పోవనీక మెడఁ బట్టుకొనియెద;
రప్పు డెందుఁ జొత్తు? ననఘచరిత!
8-698-క.
భక్షించు నొండె ఝషములు
శిక్షింతురు ధూర్తు లొండెఁ; జెడకుండ ననున్
రక్షింపు దీనవత్సల!
ప్రక్షీణులఁ గాచుకంటె భాగ్యము గలదే? "

భావము:
ఓ పుణ్య చరితుడా! ఇంక చేపలు పట్టే జాలారి వాళ్ళు వలలు పట్టుకు వేస్తారు. నదిని కలతపెట్టి నన్ను పట్టుకుంటారు. తప్పించుకుని పోకుండా, మెడ పట్టుకుంటారు అప్పడు ఎక్కడకని పోగలను. ఓ దీనవత్సలా! సత్యవ్రతా! నన్ను పెద్ద చేపలు అయినా తినేస్తాయి. లేదంటే, ధూర్తులు అయిన జాలరులైనా పట్టుకుంటారు. అలా చచ్చిపోకుండా నన్ను కాపాడు. బలహీనులను కాపాడగలిగే అవకాశం కంటే గొప్ప అదృష్టం ఏముంటుంది.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=86&Padyam=698

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: